నిరుపేద యువతి వివాహానికి హాజరైన బిజెపి నాయకులు
Published: Friday February 18, 2022
రాయికల్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ పట్టణంలో నిరుపేద మూగ ఆదివాసి కుటుంబానికి చెందిన ఆత్రం జ్యోతి వివాహము స్థానిక శివాలయంలో జరిగినది. వివాహ వేడుకకు భారతీయ జనతాపార్టీ బీర్పూర్ మండల ఇంచార్జ్ చిలకమర్రి మదన్మోహన్ హాజరై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆయనతోపాటు రాయికల్ పట్టణ బిజెపి అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, బిజెపి పట్టణ ఎస్ సి మోర్చా అధ్యక్షుడు సంజీవ్ కార్యకర్తలు పాల్గొన్నారు
Share this on your social network: