కురువెళ్ల చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పుస్తకాల పంపిణీ మధిర

Published: Thursday June 30, 2022
రూరల్ జూన్ 29 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు
*:కురువెళ్ళ చారిటబుల్ ఫౌండర్ కురువెళ్ళ కృష్ణ చే మధిర గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ బంజారా కాలనీలో 63 మంది పిల్లలకు బుక్స్ పంపిణీ చేసినారు. కురువేళ్ల చారిటబుల్ ఫౌండర్ కృష్ణ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్లో నిరుపేదలైన విద్యార్థులకు బుక్స్ పంపిణీ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని, అలాగే పిల్లలు మంచిగా చదువుకొని ప్రయోజకులు అయి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కేవీ. లక్ష్మీ రాజ్యం ఉపాధ్యాయుడు నిర్వర్తించిన రాజు మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ నాళ్ల శ్రీనివాసరావు, వేములపల్లి మల్లికార్జునరావు, కుంచం కృష్ణారావు, వేములపల్లి విశ్వనాథం, దాచేపల్లి రాము, వజినేపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు*