ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిది *విద్యుత్ అధికారిని కలిసి మెమోరం అందించ

Published: Saturday December 03, 2022

అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని ఉమర్ఖాన్ గూడ  కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యల గురించి విద్యుత్ అధికారులతో మాట్లాడి చైర్మన్  మాల్ రెడ్డి అనురాధ రామిరెడ్డి  సహకారంతో మున్సిపల్ నుంచి నూతన ట్రాన్స్ఫార్మ్ కోసం, ఔటర్ రింగ్ రోడ్ నుంచి అనాజిపూర్ వరకు విద్యుత్తు లైట్ల కోసం అలాగే కాలనీలలో విద్యుత్ సమస్య లేకుండా పరిష్కారం కోసం అంచనాల గురించి విద్యుత్ అధికారులకు ప్రోసిడింగ్ కాపీని ఇవ్వడం జరిగింది. విద్యుత్ అధికారులకు సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తిచేయాలని కరాడి శ్రీలత అనిల్ కుమార్ కోరడం జరిగింది.  ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు వంగేటి మనోహర్ రెడ్డి, గొట్టే బిక్షపతి ,పుట్టాల శ్రీకాంత్, పండుగల రాము, తుల శివ గౌడ్, గడ్డం వినోద్ పాల్గొనడం జరిగింది.