పిల్ల కాలువలో పడి రెవెన్యూ అధికారి మృతి

Published: Monday February 22, 2021
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ప్రజాపాలన: దంతాలపల్లి మండలం లోని రిపోని గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కొండ అచ్చయ్య తండ్రి భిక్షమయ్య  వయస్సు 53 సం. గ్రామం పోలేపల్లి మండలం తొర్రుర్ గారు ఈ రోజు వీరి వ్యవసాయ భూమి వద్ద పొలం పనులు చేస్తుండగా సుమారు మధ్యాన్నం 4.00 గం. సమయంలో పిల్ల కాలువలో పడి మృతి చెందినారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు కుమారుడు కలరు.