జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి 11 మంది వైద్యులు

Published: Tuesday February 09, 2021
ప్రతి వార్డు తిరిగి వివరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
 
జగిత్యాల, ఫిబ్రవరి 08 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లా ఏరియా వైద్యశాలకు రోజురోజుకు రోగుల తాకిడి పెరగటంతో సరిపడా వైద్యుల కోసం ఇటీవల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రతిమ ఆస్పత్రితో మాట్లాడగా 11 మంది వివిధ విభాగాలకు చెందిన వైద్యులు విధుల్లో చేరారు. నూతన వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆస్పత్రిలోని వార్డులు తిరుగుతూ వైద్యులు అందిచాల్సిన సేవలను వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో రోగులు ఏరియా ఆస్పత్రికి వస్తున్నారని జగిత్యాలతో పాటు వివిధ జిల్లాల నుండి రోగులు వస్తున్న నేపద్యంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని సేవే పరమావధిగా సేవలందించాలని కోరుతూ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను కోరగానే 11 మంది వైద్యులను కేటాయించిన ప్రతిమ ఆస్పత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ సుదక్షిణ దేవి, ఆర్.ఎం.ఓ రామకృష్ణ తదితరులు ఉన్నారు.
 
Atachments area