తమను వేధిస్తున్న మురహరిరావు ,అతని భార్య పై చర్యలు తీసుకోవాలి. గృహిణి ఇందూరి సంధ్యారాణి

Published: Thursday September 08, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: ఇటీవల  కూలిన తన ఇంటిని పునర్  నిర్మించుకుంటుండగా ప్రక్కనే నివాసం ఉంటున్న జెట్టి మురహరి అనే వ్యక్తి నా  ఇంటిలో సగ భాగం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని గృహిణి ఇందూరి సంధ్య ఆరోపించింది. బుధవారం స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను 24 డీప్ ఏరియా క్వార్టర్ నెంబర్-46లో గత కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్నానని, ఇటీవల తన ఇల్లు కూలిపోగా, పునర్ నిర్మాణం చేస్తుండగా ఇంటి పక్కన ఉండే జెట్టి మురహరి రావు అనే వ్యక్తి మా ఇంటి భాగంలో తన కారు పార్కు చేసుకోవడానికి కొంత స్థలం ఇవ్వాలని తనను అడగగా స్థలం ఇవ్వనని తేల్చి చెప్పానని అప్పటినుండి మురహరి రావు తనపై, తన భర్త పై తప్పుడు ప్రచారం చేస్తూ తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని బాధిత మహిళ వాపోయింది. తన భర్త లేని సమయంలో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, మురహరి, తన భార్య నుండి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని  ఆమే ఆవేదన వ్యక్తం చేసింది.