వ్యవసాయ కార్మిక సంఘం సభలను విజయవంతం చేయాలి*
మధిర డిసెంబర్ 27 (ప్రజా పాలన ప్రతినిధి) ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ కళాశాల ఆవరణలో ఈనెల 29న సాయంత్రం మూడు గంటలకు జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి మందా సైదులు కోరారు. మంగళవారం స్థానిక బోడెపుడి భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభను విజయవంతం కోసం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రూ. 25వేలు బ్యాంక్ అకౌంట్ లో వేయాలని కోరారు. పేదలకు రూ.5లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, రైతులకు రుణమాఫీ చేయాలని, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, ఓట్ల శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: