ప్రతి ఒక్కరైతు నేలలను రక్షించుకోవాలి.. అన్నారుగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి హసీనా..

Published: Tuesday December 06, 2022
తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజా పాలన న్యూస్):
 సమాజంలో ప్రతిఒక్క రైతు నేలలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి షేక్. హసీనా సూచించారు. సోమవారం అన్నారుగూడెం రైతువేదికలో ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ భూమిని రక్షించుకోవడం ద్వారా పంటల్లో దిగుబడులు పెరుగుతాయన్నారు. నేలపై పంట మార్పిడితో పాటు సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.