వేముకుంట కాలనీని ఆదర్శవంత కాలనీగా తీర్చిదిద్దుతా
Published: Saturday May 08, 2021
- కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో శుక్రవారం స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. కరోనా మహ్మమరి నియంత్రణ చర్యల్లో భాగంగా హైడ్రోక్లోరిక్ ద్రావణంను పిచికారి చేయించారు. కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కాలనీ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ రోడ్లు డ్రైనేజీ సమస్య తన దృష్టికి వచ్చిందని త్వరలోనే ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ దృష్టికి తిసికేళ్లీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు కరోనా భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే ప్రభుత్వం నుంచి వారికి కరోనా నివారణ మందులు ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుందని. ప్రజలు అధైర్య పడకుడదని తేలిపారు. బస్తీ దవాఖనాలో కరోనా కిట్లు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అక్బర్ ఖాన్, దాసు, షౌకత్, గౌరవ్, రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: