జగజీవన్ రావుకి కాంగ్రెస్ నాయకుల నివాళి
Published: Wednesday July 07, 2021
జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : మాజీ ఉపప్రధాని దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగజీవన్ రావు వర్థంతి సందర్భంగా ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా, డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు.. కాంగ్రెస్ పార్టీ లో అంచెలంచలు ఎదిగి ఉప ప్రధాని స్థాయికి చేరిన మహనీయుడు అన్నారు.. ఈ కార్యక్రమంలో మధిర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మధిర మండల sc సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మున్సిపల్ కౌన్సిలరు మునుగోటి వెంకటేశ్వరావు, కోన ధని కుమార్, మాజీ కౌన్సిలర్ మునుగోటి వెంకట నాగ లక్ష్మీ, మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుతుమాటినవీన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, సూర్యదేవర కోటేశ్వరరావు, జింకల కోటేశ్వరరావు, మైలవరపు చక్రి.. మొదలగువారు పాల్గోన్నారు
Share this on your social network: