బొల్లారంలో అంబులెన్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణ రెడ్డి

Published: Friday June 18, 2021
జిన్నారం, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీజేపీ నాయకుడు కే జే ఆర్ ఆనంద్ క్రిష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ కమీషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ బొల్లారం మున్సిపల్ పరిధిలోని హనుమాన్ మందిర్ నుండి బాచుపల్లి వెళ్లే దారిలో చెరువు కట్ట పైన స్పీడ్ బ్రేకర్స్,అలాగే బొల్లారం లో అంబులెన్సు ఏర్పాటు కోసం, ఈరోజు బొల్లారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది, అయితే కొన్ని నిముషాల పాటు అయన రోడ్డు పైన పడి గిల గిల కొట్టుకున్నాడు అయన చనిపోయే వరకు అంబులెన్సు సకాలంలో రాక మరణించడని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కావున తక్షణమే స్పీడ్ బ్రేకర్స్ మరియు అంబులెన్సు సర్వీస్ బొల్లారంకి ఏర్పాటు చెయ్యాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ కౌన్సెలర్ టీ. సాయి కిరణ్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఉదయ్ కిరణ్, మాజీ వార్డు సభ్యులు జి. శారదా తదితరులు పాల్గొన్నారు.