తల్లాడలో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు.. జెండాను ఎగరవేసిన అధ్యక్షులు కూచిపూడి..
Published: Thursday March 30, 2023
తల్లాడ, మార్చి 29 (ప్రజాపాలన న్యూస్): తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం తల్లాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు తెదేపా జెండాను ఆవిష్కరించారు. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరాయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొలినాల్లోని ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సరికొండ శ్రీనివాస్ రాజు, కొమ్మినేని రాము, నరసింహారావు, నారికొండ శ్రీనివాసరాజు, రవి ప్రసాద్, దుగ్గినేని వెంకటేశ్వరరావు, మొక్క కృష్ణ అర్జున్, టెంట్ సురేష్ , దగ్గుల శ్రీనివాసరెడ్డి, రవి, చిన్నబ్బాయి, నున్న రామారావు, చెన్ను భాస్కరరావు పాల్గొన్నారు.
Share this on your social network: