ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి నూతన టిపిసిసి ప్రతినిధులుగా మల్ రెడ్డి రంగారెడ్డి మరియు చిల

Published: Thursday September 22, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన టిపిసిసి ప్రతినిధులుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి ని మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి ని టీపీసీసీ ప్రతినిధులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ఎనుముల రేవంత్ రెడ్డి  నియమించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు బుధవారం నగరంలోని నాంపల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన నూతన ప్రతినిధుల సమావేశానికి హాజరు కావడం జరిగింది..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను టిపిసిసి నూతన ప్రతినిధిగా నియమించినందుకు ముఖ్యంగా TPCC అధ్యక్షులు నా అభిమాన నాయకుడు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి.మరియు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించడంలో సైనికుడు లాగా పని చేస్తానని కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు.. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేస్తామని,ప్రజలను దోచుకుంటున్న అవినీతి ప్రభుత్వాలు బిజెపి టిఆర్ఎస్ పార్టీలను గద్దే దించేవరకు పోరాటం చేస్తానని చెప్పారు..అతి చిన్న వయసులో నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.