పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.... --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Wednesday November 09, 2022

జగిత్యాల, నవంబర్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహేబ్ బి ఆర్ అంబేద్కర్  గౌరవార్డం నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలని  ఎమ్మేల్యే  డా.సంజయ్ అన్నారు. 
మంగళవారం జగిత్యాల లో ప్రజాసంఘాల జెఎసి, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆద్వర్యంలో నియోజకవర్గం మరియు జిల్లా నాయకులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి కెసిఆర్ అంబేద్కర్ పేరు ప్రకటించారని గుర్తు చేశారు. బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ పేరు నూతన పార్లమెంట్ భవనానికి పెట్టాలని ఈనెల 28, 29 న ఏర్పాటు చేసిన ఛలో డిల్లీ మహాధర్నా  కరపత్రాలను సంఘ నాయకులతో కలిసి ఎమ్మెల్యే డా.సంజయ్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్ జెఎసి జిల్లా అధ్యక్షులు బొనగిరి మల్లారెడ్డి, టిఎవైఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెవులమద్ది వినోద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రాజయ్య, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు సుతారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.