సమాజంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది ** జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి,, ఎమ్మెల్యే సక్కు ** "ప

Published: Friday January 06, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 5 (ప్రజాపాలన,ప్రతినిధి) : సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో వెలకట్టలేనిదని జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులు ఉన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు ముఖ్య భూమిక పోషించాలని, పత్రికలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని హితవు పలికారు.సమాజంలో ఉన్న మంచి చెడులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియడానికి పత్రికలు ప్రధాన పాత్ర వహించాలని అన్నారు. ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉండేలా పత్రికలు పనిచేయకూడదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ చైర్మన్ అలీ బిన్ హమ్మద్, ఆర్టీసీ డిపో మేనేజర్, పాత్రికేయులు ప్రజా పాలన పత్రిక జిల్లా ప్రతినిధి సురేష్ చారి, ప్రజాపాలన మంచిర్యాల్ బ్యూరో వెంకటస్వామి, చిప్ప సురేష్, వారణాసి శ్రీనివాస్, కృష్ణంరాజు, రాధాకృష్ణ చారి, రవి, తదితరులు పాల్గొన్నారు.