కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు...

Published: Monday June 28, 2021
పరిగి, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : శనివారం రాత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంతో వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని తొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి బాణసంచా పేల్చి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ పదవికి ఇవ్వడం చాలా సంతోషకరమని రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడంతో తెలంగాణాలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ఎలక్షన్ సమయాల్లో మాత్రమే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకువస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తనన్నాడు అందరికి డబల్ బెడ్ రూం ఇల్లు ఇస్తానన్నాడు ఇలా చెప్పి అందరిని మోసం చేసిన కేసీఆర్ కి కచ్చితంగా కాంగ్రెస్ బుద్ది చెప్తుందని కచ్చితంగా అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాధర్ రెడ్డి, మొగులయ్య, పొట్టిగారి హన్మంత్ రెడ్డి, కొనింటి, అంజన్ రెడ్డి, కొనింటి వెంకట్ రెడ్డి, పొట్టిగారి రామకృష్ణ రెడ్డి, చౌదరి రాజప్ప, కంద్యనం మొగులయ్య, ముష్టిపల్లినర్సింలు, చాకలి శ్రీను, చాకలి సత్యనారాయణ, కుర్వ సాయన్న, చిత్తూరి నర్సింహ రెడ్డి, చిత్తూరి కిష్టారెడ్డి, చిత్తూరి నర్సీరెడ్డి, చిత్తూరి కిష్టారెడ్డి, పంబల రామచంద్ర, పంబల కృష్ణయ్య, చింతకాయ బావయ్య, చింతకాయ రాజు, చింతకాయ సీతారాం, చింతకాయ కృష్ణయ్య, మంగలి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.