ఇసుక ట్రాక్టర్ బోల్తాకు అతివేగం కారణమా..!

Published: Saturday February 06, 2021
ఎక్కువ ట్రిపుల్ చేయాలనే ఆలోచనతో అతివేగంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లు...
మధిర ఎర్రుపాలెం  నుండి రోజు ప్రభుత్వ కూపన్లు పై ఇసుక రవాణా చేస్తూ ఈ క్రమంలో అతి వేగంగా వెళ్తున్న టాక్టర్లు ఒక దానిని దాటి మరొకటి ముందుకు వెళ్లే క్రమంలో రెండు ట్రాక్టర్లు గుద్దుకొని బ్రాహ్మణపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది.
ఒక పర్మిట్ పై రెండు అంతకన్నా ఎక్కువ రిప్లై ఇవ్వాలని ఉద్దేశంతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లు అతి వేగంగా వాహనాలు నడపడం అటు ప్రజలకు ఇటు వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు మైనింగ్ శాఖ పోలీస్ శాఖ వారు ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించే చేయవలసిందిగా ప్రజల పక్షాన కోరుకుంటున్నాము.