మధ్యాహ్నం ఉపాధ్యాయులు రుచి చూసిన తరువాతే విద్యార్థులకు వడ్డించాలి. జిల్లా విద్యాశాఖ అధికార

Published: Wednesday November 02, 2022
పాలేరు నవంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి
మన ఊరు మన బడి పనులు శర వేగంగా చేయించేందుకు చర్యలు. ఉపాధ్యాయుడుగా మారిన జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ను ఉపాధ్యాయులు రుచి చూసిన తరువాతనే విద్యార్ధులకు వడ్డించాలని జిల్లా విద్యాశాఖాధికారి| యాదయ్య ఆదేశించారు. మండలం లోని కోనాయిగూడెం.
కొరట్లగూడెం, అమ్మగూడెం. మోటాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సందర్శించారు. పలు రికార్డులను తనీఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం ను రుచి చూశారు. ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. నేల పై కూర్చుని విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా తెలుసుకున్నారు. కోనాయిగూడెం లో ఉపాధ్యాయురాలు భవాని తన కుమారుడు ను ప్రభుత్వ స్కూల్ లో చేర్పించినందుకు ప్రత్యేకంగా అభినందించారు.