కరెంట్ తీగ తగలి గేదె మృతి
Published: Wednesday June 08, 2022
జన్నారం రూరల్, జున్ 07, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన చెటిపెల్లి గంగయ్య కు చెందిన గేదె స్థానిక గ్రామ రైతు పొలంలో ప్రమాదకరంగా తెగిపడిన పదకొండు కెవీ విద్యుత్ వైర్లకు తాకి అక్కడికక్కడే గేదె మృతి చెందిందని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు, ఈ సందర్భంగా మంగళవారం మాట్లాడుతూ మరణించిన గేదెకు పంచనామా నిర్వహించారు, మరణించిన గేదె విలువ సుమారు 85000 రూపాయలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. మరణించిన గేదెకు తగిన నష్టపరిహారం చెల్లించాలని విద్యుత్ అధికారులను కోరినట్లు బాధిత రైతు తెలిపారు.
Share this on your social network: