బాపునగర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ శేషుకుమారి.

Published: Tuesday October 12, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ఆడపడుచుకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని, ఈ పండుగకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, మంత్రి తలసాని ఆదేశాలతో అమీర్ పేట్ డివిజన్ లో ప్రతీ యేటా ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి తెలిపారు. ఈ సందర్భంగా బాపు నగర్ బస్తీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు బస్తీ అధ్యక్షుడు హరి సింగ్ జాదవ్, రాజు నాయక్, సీనియర్ తెరాస నేతలు అశోక్ యాదవ్, కూతురు నరసింహ, రోజా రెడ్డి, బలరాం, జితేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.