ఐపీఎస్ కోట కిరణ్ ని సన్మానించిన డా.కోట రాంబాబు
Published: Wednesday November 17, 2021
ఎర్రుపాలెం నవంబర్ 16 ప్రజా ప్రతినిధి : ఇటీవలే విడులైన సివిల్స్ ఫలితాల్లో రాంక్ సాధించి ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన భీమవరం గ్రామానికి చెందిన కోట కిరణ్ ని టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు ఘనంగా సన్మానించారు. వారి ఉన్నత చదువులకు వెన్నెముకగా ఉన్న వారి తల్లదండ్రులను కూడా సన్మానించారు. కోట రాంబాబు మాట్లాడుతూ కిరణ్ తల్లిదండ్రులను, వారి గొప్పతనాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ కుమారులను ఈ స్థాయికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట జయరాజు, నండ్రు శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొ్నారు.
Share this on your social network: