సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Saturday February 04, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా పాత రామంతాపూర్లోని అంబేద్కర్ భవన్ నుండి శ్రీనగర్ కాలనీ కమిటీ హాల్ వరకు వేస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పరిశీలించారు. నాణ్యత లోపించకుండా సీసీ రోడ్డును వేయాలని కార్పొరేటర్ కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగమణి, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, బొడ్డుపల్లి ఆనంద్, కాలనీవాసులు పాల్గొన్నారు.