పార్టీ బలోపేతంపై సైనికుల్లా పనిచేయాలి

Published: Thursday December 02, 2021
వైరా డిసెంబర్ 01 ప్రజాపాలన ప్రతినిధి : వైరా నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని పరుచూరి గార్డెన్లో వైఎస్సార్ టి పి వైరా పాలేరు నియోజకవర్గాల ఇన్చార్జి లక్కినేని సుధీర్బాబు ఆధ్వర్యంలో మంగళవారం వైరా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇస్లావత్ రాంబాబునాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్బంగా లక్కినేని సుధీర్బాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యకర్తల సమస్యలను తీర్చడంలో మన పార్టీ నాయకులు ముందుండాలన్నారు పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం వైరా కొణిజర్ల ఏన్కూరు జూలూరుపాడు కారేపల్లి మండల అధ్యక్షుల ఎన్నిక జరిగింది ఈ సందర్బంగా వైరా మండల పార్టీ అధ్యక్షులుగా ఈవీఎం ప్రసాద్ యాదవ్ కొణిజర్ల మండల అధ్యక్షునిగా చింతల శ్రీనివాస్ (వాసు) ఏన్కూరు మండల అధ్యక్షుడిగా యరమల మాధవరెడ్డి జూలూరుపాడు మండల అధ్యక్షుడిగా దుపాటి వెంకటరాజు, కారేపల్లి మండల అధ్యక్షునిగా తాళ్లూరి రాంబాబు లను పార్టీ నియమించింది ఈ సందర్బంగా వైరా పాలేరు నియోజకవర్గాల ఇన్చార్జి లక్కినేని సుధీర్ బాబు చేతుల మీదుగా ఆ నియామక ఉత్తర్వులను నూతన మండల అధ్యక్షుడు అందుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా నియమితులైన వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎస్వీ గౌడ్, షేక్ మోహినుద్దీన్, జిల్లా నాయకులు వాలురి సత్యనారాయణ, యండపల్లి వెంకయ్య, గజేంద్ర సైదులు, బి యన్ లాల్, జక్రయ్య, యాకోబు వాకదాని శ్రీనివాసరావు, ఆలస్యం సతీష్, తప్పెట అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక వైరా నియోజకవర్గ స్థాయి స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఇస్లావత రాంబాబు నాయక్, లక్కినేని ప్రభాకర్ రెడ్డి, వాకదాని శ్రీనివాస్ యాదవ్, నామా వినోద్, షేక్ కరీమ్ లను సభ్యులుగా నియమించారు