ప్రజల పక్షాన చివరి వరకు పోరాడిన నాయకుడు వేముల మహేందర్

Published: Thursday July 01, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి బుధవారం మండల పరిధిలో పులిగిల్ల గ్రామంలో జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి చిన్నతనంలో పట్టిన ఎర్రజెండాను చివరి శ్వాస దాకా వదలకుండా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడిన మహోన్నతమైన వ్యక్తి వేముల మహేందర్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహాంగీర్ అన్నారు. స్థానిక మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వేముల మహేందర్  దశదినకర్మ సందర్భంగా పులిగిల్ల గ్రామంలో సిపిఎం నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహాంగీర్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎర్రజెండా చేతపట్టి నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ వలిగొండ మండల వ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా కూలీలు పేదల సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన ఆశయ సాధనకు పునరంకితం అవుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన మహేందర్ అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు గౌరవించే విధంగా తాను నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశాడని అన్నారు. మండల వ్యాప్తంగా ఏ గ్రామానికి సంబంధించిన ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పని చేసేవాడిని ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే వాడని ఆయన ఆశయం చాలా గొప్పదని ఆయన ఆశయ మార్గంలో పార్టీ కార్యకర్తలు అందరూ పని చేయాలని ఆయన అన్నారు. మహేందర్ ఆశయాన్ని సాధించడమంటే మహేందర్ నడిచిన బాటలో నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమించడమేనని సమసమజాన్ని సాదించడమేనని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని ఆయన కోరుకున్న ఆశయాన్ని సాధిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు,సిర్పంగి స్వామి, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, అనగంటి వెంకటేష్, సిపిఎం సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, తుర్కపల్లి సురేందర్, గాజుల అంజనేయులు, ఏలే కృష్ణ, కొండ కృష్ణయ్య, కల్కురి రామచందర్, కందడి సత్తిరెడ్డి, సిపిఎం శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి, మారబోయిన నరసింహ, దొడ్డి బిక్షపతి, ఉండ్రాటి పాపయ్య, తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్ కు నివాళులర్పించిన పలు పార్టీల నాయకులు. స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపూరి కవిత, సింగిల్విండో చైర్మన్, సురకంటి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షురాలు పడమటి మమత, భువనగిరి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రాజిరెడ్డి, వలిగొండ మాజీ ఎంపిపి తుమ్మల నరసయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పైళ్ల రాజ వర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ వలిగొండ మండల అధ్యక్షుడు డేగల పాండరి తదితరులు పాల్గొన్నారు.