మాదాపూర్ గ్రామం లో పర్యటించిన సర్పంచ్ దారిశెట్టి రాజేష్

Published: Monday July 11, 2022
కోరుట్ల, జూలై 10 ( ప్రజాపాలన ప్రతినిధి ):
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం రోజున మాదాపూర్ గ్రామంలో పర్యటించిన జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మాదాపూర్ స్థానిక సర్పంచ్ దారిశెట్టి రాజేష్ అలాగే ఈ సందర్భంగా దారిశెట్టి రాజేష్  పాత ఇళ్లల్లో ఉన్న వారిని క్షేమంగా వేరే ఇంటికి తరలించి, లోతట్టు ప్రాంతాలలో  ఆగి ఉన్న వాన నీళ్లను గ్రామ పంచాయతీ సిబ్బంది తో ఆ నీళ్లను డ్రైనేజీ లకు తరలించారు.రానున్న 48 గంటల్లో భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం మల్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, పాక్స్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి, వార్డు మెంబర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area