ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి *మల్రెడ్డీ రంగారెడ్డి చేతుల మీదుగా ప్రజా
Published: Wednesday December 28, 2022
ఇబ్రహీంపట్న కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా సోమవారం ప్రజా పాలన క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ తన వంతు కర్తవ్యం గా కృషి చేస్తున్నాయని, ప్రజాస్వామ్యం లో నాలుగవ పిల్లర్ గా పనిచేస్తున్న పాత్రికేయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, కొండ్రు ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురునాథ్ రెడ్డి, ఇబ్రహింపట్నం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్,. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: