ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీమధిర సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి మున

Published: Monday September 26, 2022
 తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మధిర పట్టణం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంఆవరణ నందు ఈరోజు నిరుపేద మహిళలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ సిద్ధంశెట్టి శ్రీకాంత్ చే "దుప్పట్లు" పంపిణీ చేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అన్ని వర్గాలను కలుపుకుంటూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ పలువురు ఆదర్శంగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ ముందు రానున్న రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారు తెలిపారు అనంతరం
 రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ సిద్ధంశెట్టి శ్రీకాంత్ మరియు  ఆర్యవైశ్య మహాసభ సంఘ మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు, మండల ఆర్యవైశ్య అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు, పూర్వ విద్యార్థి సంఘ సేవకులు మాధవరపు నాగేశ్వరరావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ జగన్ మోహన్ రావు ర  మాట్లాడుతూ నిరుపేద ఆర్యవైశ్యల సంక్షేమ కొరకు నిరంతరం సేవా దృక్పథం తో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ మిరియాల కాశీ విశ్వేశ్వరరావు గౌరవ సలహాదారు యర్రా లక్ష్మణరావు, మధిర ఆర్యవైశ్య సంక్షేమ నియోజకవర్గ, మండల, పట్టణ, అధ్యక్షులు చలువాది కృష్ణమూర్తి రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ పబ్బతి రమేష్, వెచ్చా వీరభద్రరావు, మరియు దొడ్డా శ్రీనివాసరావు, పరిశా శ్రీనివాసరావు, కొత్తమాసు రామారావు,పాల్గొన్నారు