హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్

Published: Monday August 22, 2022

జగిత్యాల, ఆగస్టు 21 (ప్రజాపాలన ప్రతినిధి): 75వ భారత స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ పాల్గొని మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సహకారమైందని అన్నారు. స్వతంత్ర సమరయోధుల గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, సర్పంచ్ ఎల్లా గంగానర్స్ రాజన్న, డి.ఆర్.డి.ఎ వినోద్ ఎస్సి కార్పొరేషన్ పిడి లక్ష్మీనారాయణ, డిపిఒ నరేష్ ఎంపిడిఒ రాజేశ్వరి, ఎఫ్ఆర్ఒ ప్రణీత కౌర్, ఎంపిఒ రవిబాబు, ఐకెపి ఎపియం గంగాధర్, గ్రామ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, జడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.