ఉప్పల్ డివిజన్లో రూ 77 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
Published: Tuesday January 24, 2023
మేడిపల్లి, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. డివిజన్లోని దేవేందర్ నగర్లో రూ 37లక్షలతో సీసీ రోడ్ నిర్యాణం, సరస్వతి కాలనీలో రూ16 లక్షలతో సీసీ రోడ్, సెవెన్ హిల్స్ కాలనీలో 24 లక్షలతో సీసీ రోడ్డులు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రజితపరమేశ్వర్ రెడ్డి రూ.77 లక్షలు జిహెచ్ఎంసి నుండి నిధులను మంజూరు చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఏఈ వసంత, జలమండలి మేనేజర్ సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి , గరిక సుధాకర్, లేతఆకుల రఘుపతి రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, వేముల సంతోష్ రెడ్డి, మస్కసుధాకర్, చింతల నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, స్వీట్ హౌస్ రాజు, నాయబ్ వెంకట్రావు, టం టం వీరేష్, సరస్వతి కాలనీ ,దేవేందర్ నగర్ ,ఉప్పల్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ,చెర్ల సుధాకర్ రెడ్డి ,రవీందర్ అలీం ,జూలూరి శ్రీధర్ గుప్తా, లూకాస్ ,ఉపేందర్ రెడ్డి,ప్రతిభ స్థానిక కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: