ఈ నెల 25న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ **
Published: Monday August 22, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు21(ప్రజాపాలన, ప్రతినిధి) : ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, సిఐటియు జిల్లా కమిటీ పిలుపుమేరకు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ, విఓఏ,లు ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల గురించిఅవగాహన కల్పిస్తూ, వివో గ్రూపుల ద్వారా బ్యాంకులలో నిధులను జమ చేస్తూ, అనేక మంది మహిళలకు డ్వాక్రా రుణాలు ఇప్పిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. వీరి కష్టాన్నితెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ, కనీస వేతనం రూ 21 వేలు ఇవ్వాలని, పిఆర్సి 30శాతం అమలు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలని, డిమాండ్ చేస్తూ ఈనెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి కేబీ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐకెపి, వివో ఏ లు పెద్ద ఎత్తున తారళి వెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాధా, పైమా, రమా, అర్చన,జ్యోతి, సునీత, శారద, రమేష్ బుద్ధు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: