ఓటమి భయంతో బీజేపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు --తమ్మినేని వీరభద్రం

Published: Tuesday October 11, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి):మునుగోడు ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతో విచక్షణ కోల్పోయి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారని సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చౌటుప్పల్ మండలం జైకేసారం, నేలపట్ల, మందోల్లగూడెం గ్రామాలలో పర్యటించి మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. రాజగోపాల్ రెడ్డి జనం సమస్యలు పట్టించుకోకుండా తన స్వప్రయోజనాల కోసమే పార్టీని వాడుకొని ప్రజలను పక్కన పెట్టారని, తాను కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయానని స్వయంగా ఒప్పుకున్నారని ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. మునుగోడు ప్రజలు సాయుధ పోరాట స్ఫూర్తితో నిండిన చైతన్యవంతులని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ నాయకులకు తాము ఓడిపోతామని అర్థమయ్యే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.
   రాష్ట్రంలో మతకల్లోలాలు,అల్లర్లు సృష్టిస్తున్న బీజేపీని ఓడించాలని కోరారు.
కారు గుర్తుపై ఓట్లు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, చౌటుప్పల్ మండల, మున్సిపల్, కార్యదర్శులు గంగాదేవి సైదులు, బండారు నరసింహ. నాయకులు తడక మోహన్, బుట్టి కృష్ణ, కొండే శ్రీశైలం, బోదాసు వెంకటేశం, పల్లె మధు కృష్ణ, రాగిరు కృష్ణయ్య, జహంగీర్, శ్రీనివాస్, దొడ్డి శేఖర్, బయ్య దామోదర్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.