పేషెంట్ ని హాస్పిటల్ కి పంపించి మానవత్వం చాటుకున్న పాల్వంచ సిఐ నాగరాజు....శభాష్ పోలీసు అంటున్

Published: Thursday December 29, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)

 రాష్ట్రపతి ముర్ము  భద్రాద్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా పూర్తిగా వాహనాలు నిలిపివేయడం జరిగినది. ఈ సందర్భంగా  హాస్పిటల్ కి చిన్నపిల్లలతో వచ్చే  పేషెంట్లని  పోలీస్ వాహనాల ద్వారా భద్రాచలం హాస్పిటల్ కి తరలిస్తున్న పాల్వంచ.సిఐ నాగరాజు బూర్గంపాడు ఎస్ఐ .సంతోష్ పోలీస్ వాహనాల ద్వారా తరలిస్తున్న వైనం. శభాష్ పోలీస్ అంటున్న పట్టణ ప్రజానికం. పోలీస్ వాహనాల ద్వారా పేషంట్లని భద్రాచలం ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకొని పెద్ద మనసు చాటుకున్న సిఐ నాగరాజు మరియు ఎస్సై సంతోషిని ప్రజలు అభినందనలతో ముంచేత్తుతున్నారు. మీ యొక్క సేవలు అభినందనీయమని ప్రజలు హర్ష కేతనాలు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ కు నిదర్శనం ఇదే అని ప్రజలు అంటున్నారు.