కాంగ్రెస్ పార్టీలో చేరిక

Published: Friday August 13, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని అర్రుర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సుక్కు ముత్యాలు స్థానిక జెడ్ పి టి సి వాకిటి పద్మ అనంత రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎంపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఉద్యమ కాంక్షలను తొక్కి పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కార్యకర్తలు అధైర్య పడవద్దని రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన  అన్నారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి కార్యదర్శి కసుభ శ్రీనివాసరావు, వలిగొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందాల రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ జినుకల దానయ్య, పోలేపాక చెమ్మయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు ఆవుల చంద్రకళ సత్యనారాయణ, వేముల శాంతమ్మ ఎట్టయ్య, బుర్ర నిర్మల నరసింహ, కసిరబోయిన రుక్కమ్మ సాయిమల్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.