మల్లారంలో తీవ్రంగా ఉన్న కోతుల బెడద . అరికట్టాలని గ్రామస్తుల విన్నపం .
Published: Monday April 03, 2023
మధిర రూరల్ ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం మల్లారం లో కోతులు తో ఇంటి లో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలుపుతున్నారు. పత్తి,మొక్క జొన్న పంటలు ను కోతులు భారీ నుండి కాపాడు కో లేక సుబాబుల్ వేస్తున్న రైతులు.
గ్రామ పరిధి లో ఉన్న భూమిలో సగానికి పైగా సుబాబుల్,జామాయిల్ వేశారు. దీనికి కారణం కోతులు బెడద ఎక్కువగా ఉండటమే.ప్రభుత్వం స్స్పందించి కోతులు బెడద ను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ఇళ్లల్లో కూడా మహిళలు ఈ కోతులు వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లో పనిచేసుకోవాలన్న గృహిణులు కోతుల బెడదతో భయపడుతున్నారు. ఏ విధంగానైనా కోతులు బెడదను అరికట్టాలని మల్లారం గ్రామస్తులు కోరుతున్నారు.
Share this on your social network: