ఘనంగా శ్రీ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం

Published: Friday July 30, 2021
మేడిపల్లి, జూలై 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద గల శ్రీ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, బోడుప్పల్ టీఆర్ఎస్ నాయకులు మోదుగుల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు నరసయ్య, డాక్టర్లు శ్రీనివాస్, రవితేజ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.