సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్లో సిఎన్జి ఫెసిలిటీ ప్రారంభం

Published: Tuesday September 20, 2022
వినియోగదారులకు నాణ్యతతో కూడిన
సిఎన్జి నీ అందించడంతోపాటు పెట్రోల్ డీజిల్ ని కూడా అందిస్తున్నాం
     --- పగిళ్ల సుధాకర్ రెడ్డి
 
చౌటుప్పల్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మండలంలోని కైతాపురం స్టేజి వద్ద సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్లో యజమాని పగిళ్ల సుధాకర్ రెడ్డి, వినియోగదారుల కోసం నూతనంగా సిఎన్జి ఫెసిలిటీ ని సోమవారం గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్ సుంద రేసన్, పాల్గొని సిఎన్జి ఫెసిలిటీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి లో వినియోగదారుల కోసం
సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్లో యజమాని పగిళ్ల సుధాకర్ రెడ్డి,సిఎన్జి ఫెసిలిటీ ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్ యజమాని పగిళ్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యతతో కూడిన
సిఎన్జి నీ అందించడంతోపాటు పెట్రోల్ డీజిల్ ని కూడా అందిస్తున్నామని వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ జోన్ హరి ప్రసాద్, చీఫ్ రీజినల్ మేనేజర్ రావు సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.