డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ కు ఎ పి జె అబ్దుల్ కలాం అవార్డు

Published: Wednesday November 16, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన: 
 
జిల్లా కేంద్రంలోని ఎయిమ్స్క్ట ఆసుపత్రి అధినేత , వైద్యులు యెగ్గన శ్రీనివాస్ కు ఎ పి జె అబ్దుల్ కలాం అవార్డును ఆక్ట్ నౌ   ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలోని సేవలకు, శ్రేష్ఠతకు ఎ పి జే  అబ్దుల్ కలాం అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పేదలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేసుకుని పలు సేవ కార్యక్రమాలు చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్ తన 
తల్లిదండ్రులకు,జీవిత భాగస్వామి  డాక్టర్ సునీత కు  అంకితం చేసినట్లు అయన తెలిపారు., అనకు ప్రత్యక్షంగా,  పరోక్షంగా మద్దతునిచ్చి ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా  ధన్యవాదాలు తెలిపారు.