దళితబందును వెంటనే మంజూరు చేయాలి : బీజేపీ

Published: Monday January 17, 2022

బీరుపూర్, జనవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ వెంటనే దళితబందును మంజూరు చేయాలని బీరుపూర్ మండల్ పర్యటనలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి హుజురాబాద్ ఎలక్షన్ ముగిసిన తర్వాత దళితబంధు గురించి ఎలాంటి ఉసు లేకుండ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నాయకులు వాపోయారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ బిజెపి మండల అధ్యక్షుడు ఎనగందుల చంద్రశేఖర్ సబ్బ దేవరాజం బోరే నగేష్ కందుకూరి లక్ష్మణ్ గొస్కుల రాకేష్ దవనపెళ్ళి గంగాధర్ ఆరేళ్ల తిరుపతి దళిత మోర్చా అధ్యక్షుడు నారపాక ప్రభాకర్ నారాపాక అనిల్ వెలుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.