అనాధ బాలికకు ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్

Published: Saturday June 26, 2021
ఇబ్రహీంపట్నం, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వెంకటేష్ కొనెళ్ల క్రిందట చనిపోయారు. ఇటీవల ఆయన భార్య సుమలత కూడా అనారోగ్యంతో మృతి చెందినారు. తల్లి మృతితో కూతురు కావేటి స్వాతి (13) అనాధగా మిగిలింది. ఆ బాలికకు లయన్స్ క్లబ్ ఇబ్రహీంపట్నం తరుపున తక్షణ సహాయం కింద రూ. 5 వేలు ఆర్థిక సహాయంచేశారు. బాలికకు అన్నివిధాలుగా అండగా ఉంటామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నేమురి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉటూరి ప్రదీప్, జె.డి.సుమన్, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, బద్దం గోపి, జింక శ్రీను, రెబ్బటి రాజా శేఖర్ యాదవ్, నేమురి నరేష్, పొడిటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.