రక్తదానం చేసిన తెరాస కార్యకర్తలు

Published: Thursday February 17, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, ప్రజాపాలన ప్రతినిధి: కేసీఆర్ జన్మదినం ను పురస్కరించుకుని బుధవారం బెల్లంపల్లి పట్టణం లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయంతో ఏర్పాటుచేసశారు. ఈ రక్తదాన శిబిరంలో నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జిల్లాలో రక్తహీనతతో ఎంతోమంది ప్రజలు అవస్థలు పడుతున్నారని, అన్ని దానాల కంటే రక్తదానం ముఖ్యమని భావించి కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. రక్తదాన శిబిరానికి హాజరై రక్తాన్ని దానం చేసిన దాతలకు, శిబిరానికి దాతలను తీసుకువచ్చిన నియోజకవర్గంలోని తెరాస ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్లకు, సిబ్బందికి, సింగరేణి యాజమాన్యానికి, ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటీ వారు అందించే సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో పాటు ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేశ్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, పట్టణంలోని 31 వార్డుల కౌన్సిలర్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస, టీబీజీకేఎస్ నాయకులు, శాంతి ఖని, కాసిపేట, గనుల కార్మికులు, ఫిట్ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు