పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎన్ ఆర్ ఐ

Published: Monday July 04, 2022
బోనకల్ ,జులై 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని
గోవిందాపురం ఏ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భాగం రాకేష్ ఆదివారం గ్రామంలో పలు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయము, నిత్యవసర సరుకులను అందజేశారు. అదేవిధంగా గ్రామంలో ముస్లిం కాలనీకి చెందిన షేక్ నాగులు విద్యుత్ షాక్ తో చనిపోవడంతో వారి కుటుంబానికి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం నిత్యవసర వస్తువులను ఆర్థికసాయంగా అందజేశారు. దారా సెల్వ చనిపోవడంతో వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు నగదు నిత్యవసర సరుకులను అందించినారు. గండమాల సుందరమ్మకు 1000 రూపాయలు, నామా చుక్కమ్మకు 1000 రూపాయలు, ఇస్రం గోపి వివాహం సందర్భంగా నూతన వస్త్రములను బహుకరించారు. మేడి అణవమ్మకు 1000 రూపాయలు, ఇస్సరం చుక్కమ్మకు 1000 రూపాయలు ,గంధమాల మేరమ్మకు నిత్యవసర సరుకులు, గ్రామంలో ఇటీవల విద్యుత్ షాకుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షేక్ నాగుల కుటుంబానికి 5000 రూపాయలు మరియు నిత్యవసర సరుకులను అందించడం జరిగినది. గ్రామంలోని పెద్దలు గ్రామాభివృద్ధికి, పేదవారికి ఆర్థిక సహాయం చేస్తున్న భాగంరాకేష్ ను అభినందించినారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు భాగం నాగేశ్వరరావు, కావూరి సాయి శశాంక్, షేక్ ఫకీర్ సాహెబ్, గండమాల రాయప్ప, షేక్ రంజాన్ సాహెబ్, వడ్డెబోయిన ఉపేంద్ర, ఇస్రం వినోద్, వక్కంతుల తిరుపతిరావు, వడ్డబోయిన సతీష్, అనబోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.