నేడే నిరసన కార్యక్రమం

Published: Thursday October 28, 2021
మల్రాజు శ్రీనివాసరావు బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు
బెల్లంపల్లి అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి :  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణలో భాగంగా సింగరేణిలో నాలుగు బొగ్గు గు బ్లాకులు వేలం వేసే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస రావు అన్నారు. బుధవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణకు అప్పజెప్పే తతంగాన్ని ఇప్పటికైనా మానుకోవాలని దానికి నిరసనగా గురువారం నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని బొగ్గు గనుల పైన, ఉపరితల గనుల పైన, వివిధ డిపార్ట్మెంట్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి స్థానిక అధికారులకు మెమోరాండం సమర్పిస్తామని ఆయన తెలిపారు.