నూతన పైపులైన్ ను ప్రారంభించిన సర్పంచ్ అలేఖ్య..

Published: Monday December 12, 2022
 తల్లాడ, డిసెంబర్ 11 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలం కేశవాపురం గ్రామంలో వాటర్ ట్యాంక్ నుంచి కొత్తగా పైపులైన్ ను సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అలేఖ్య మాట్లాడుతూ మండల జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు  సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తున్న జడ్పిటిసి ప్రమీలకి గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు చిన్నంశెట్టి పద్మ, సాదం నాగమణి, కట్ట శ్రీనివాసరావు, సాదం క్రిష్ణవేణి  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వనిగండ్ల మాధవరావు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వనిగండ్ల వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు చావా నాగేశ్వరరావు,చావా శేషగిరి, చుండూరు రామారావు,గుంటుపల్లి అప్పారావు, వీ నరేష్  పాల్గొన్నారు.