గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Monday November 14, 2022
జన్నారం,నవంబర్ 13, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని పీఆర్ టీయు భవన్ లో ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కాసారపు పోచగౌడ్, పరకాల తిరుపతి గౌడ్, మండల  అధ్యక్షుడు మూల బాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షుడు తిరుమల అంజగౌడ్, పోడేటి మల్లేశ్ గౌడ్, తనుగుల భూమగౌడ్, మూల నారయణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోడేటి నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి రమేష్ గౌడ్, ప్రచార కార్యదర్శులు బురగడ్డ నరేష్ గౌడ్, రాసమల్ల పాపాగౌడ్, పోడేటి రామాగౌడ్, తనుగుల చిన్నాగౌడ్, పోతుగంటి రమేష్ గౌడ్, కోషాధికారి అమరగొండ సతీష్ గౌడ్, ముఖ్య సలహదారులు ఎనుగంటి సతీష్ గౌడ్, కైరం భీమాగౌడ్, గాజుల లింగాగౌడ్, రాసమల్ల శంకర్ గౌడ్, తనుగుల రాజాగౌడులు ఎకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అదేవిధంగా కార్యవర్గం ముందు గౌడ కులస్తులు మండల కేంద్రంలోని ఎఅర్ఎస్ కాలేజ్ నుండి పీఆర్టీయ భవన్ వరకు భారి ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రోఫెసర్ జయశంకర్, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రాహలకు పూల మాలలు వేసి నివాళ్లర్పించారు.