బాలింగ్ సతయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైస్ పంపిణీ..

Published: Friday September 02, 2022

శేరిలింగంపల్లి -ప్రజా పాలన/సెప్టెంబర్ 1 :వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అందరూ అన్నదానం చేస్తారన్న విషయం తెలిసిందే. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ హఫీజ్‌పేట్ 109 డివిజన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకి బాలింగ్ సతయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున రైస్ బ్యాగ్స్ పంపిణీ చేవారు. హఫిజ్ పెట్ 109 డివిజన్ తెరాస ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ మండపాల నిర్వాహకులకు స్వయంగా రైస్ బ్యాగ్స్ అందజేశారు. గణపయ్య చల్లని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ఆకాక్షించారు