బీరుపూర్ మండల్ ప్రెస్ అధ్యక్షులుగా గొడిసెల రమేష్
Published: Tuesday February 14, 2023
బీరుపూర్, ఫిబ్రవరి 13 (ప్రజపాలన ప్రతినిధి):
బీరుపూర్ మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గొడిసెల రమేష్ ఎన్నికయ్యారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుడూరి శోభన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున నిర్వహించిన ఎన్నికల్లో మండల ప్రధాన కార్యదర్శిగా సాతర్ల మహేష్ ఉపాధ్యక్షులుగా గుమ్మడి రమేష్ చింత కృష్ణ సంయుక్త కార్యదర్శిగా చీర్నేని శ్రీనివాస్ తోట నరేందర్ కోశాధికారిగా పురంశెట్టి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అడెపు రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా సుంకరిపెళ్లి రవీందర్ అక్కినపెళ్లి వేణుగోపాల్ పాత్రికేయులు శనిగారపు రవీందర్ శనిగారపు రాజేష్ పొకల్కర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: