గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన చైర్పర్సన్ జక్కుల శ్వేత

Published: Tuesday September 06, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 5  ప్రజా పాలన ప్రతినిధి: ఎలాంటి  ఆటంకాలు లేకుండా గణేష్ నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు, పట్టణ ప్రజలు ముఖ్యంగా యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అందరూ సహకరించాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అన్నారు.
సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం చేసే స్థానిక పోచమ్మ చెరువును ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 200కు పైగా గణేష్ విగ్రహాలు చిన్నవి, పెద్దవి, కలిసి ఉంటాయని వాటిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించి ఎలాంటి ఆటంకాలు లేకుండా మున్సిపల్, పోలీసు అధికారులకు, సహకరించాలని పట్టణ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
 ఈ కార్యక్రమంలో  4 వ వార్డు కౌన్సిలర్  ఆస్మా షేక్, మున్సిపల్ కమిషనర్, మరియు సి ఐ,కోట బాబురావు, ఎస్సై ఆంజనేయులు, ఏ ఈ సందీప్ ,ఇన్చార్జి  సానిటరీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, 
 మున్సిపల్ సిబ్బంది, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.