జెసిబితో పిచ్చి మొక్కలు తొలగిస్తున్న డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్
Published: Thursday July 08, 2021
మేడిపల్లి, జూలై 7 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ చెంగిచెర్ల సాయి నగర్ కాలనీ మరియు మాత అరవింద కాలనీల్లో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజల సహకారంతో డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: