ఆటో కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు.

Published: Thursday December 09, 2021
బోనకల్, డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాపల్లి గ్రామానికి చెందిన బండి నాగరాజు అనే వ్యక్తి ఆటోను ఇంటి ముందు పెట్టుకున్న తరుణంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో యువకులు జీవనాధారం కోల్పోయిన సంఘటన మండల పరిధిలోని రా పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాపల్లి గ్రామానికి చెందిన బండి నాగరాజు కు కొంత వినికిడి లోపం ఉన్నా నిత్యం తన గ్రామం నుండి ఖమ్మం పట్టణానికి ఆటోలో తీసుకెళ్లి వారితో పాటు కూలి పనులు చేసుకుని తిరిగి వారి గ్రామానికి చేరుస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆటో పై పెట్రోల్ పోసి నిప్పంటిచడంతో పూర్తిగా కాలిపోయింది. తన కుటుంబ పోషణకు జీవనాధారంగా ఉన్న ఆటో కాలిపోవడంతో తన కుటుంబం ఆవేదన చెందుతున్నారు.