కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి

Published: Friday December 10, 2021

కోరుట్ల, డిసెంబరు 09 (ప్రజాపాలన ప్రతినిధి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జువ్వాడి కృష్ణ రావులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo ఇచ్చిన మహా తల్లి సోనియా గాంధీ  అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర రాష్ట్రoలో పార్టీ పతనం అయిపోతాది అని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రo ఇచ్చారు అని జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి అత్యధికంగా మెంబర్ షిప్ నమోదు చేయాలని అన్నారు.